సెలెబ్రెటీలకు షాక్ : నటించే యాడ్ లో నిజం లేకపోతే ఇక జైలు శిక్షే... త్వరలో రానున్న కొత్త చట్టం
తెలుగులో చూస్తే మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్ యాడ్స్ చేయడంలో ముందున్నారు. ఇప్పుడు ఏదైనా వస్తువు గురించి ప్రచారం చేయాలనుకున్నప్పుడు ఇకపై అలోచించాల్సిందే. ఇది ఇకపై భాద్యతగా తీసుకోకతప్పదు. నాగార్జున కళ్యాణ్ జువెలర్స్ యాడ్స్ లో నటిస్తున్నప్పుడే తూకల్లో మోసాలు జరుగుతున్నాయని కొలతల శాఖ ఒక చోట గుర్తించింది కూడా. కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించక తప్పదు. ఈ మధ్య మ్యాగిలాంటి ఆహార పదార్థాలకు సంబంధించి నాణ్యత ప్రమాణాల్లో బోలెడన్ని అనుమానాలు, ఫిర్యాదులు వస్తున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో కూడా థమ్స్ అప్, డైరీ మిల్క్ లాంటి ప్రొడక్ట్స్ విషయంలో వివాదాలు తలెత్తితే వాటి నుంచి బయటకు రావడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు రూపొందించే పనిలో నిమగ్నమైంది. అది కార్యరూపం దాల్చే పక్షంలో నిందితులకు జైలుశిక్ష మాత్రమే కాకుండా వాళ్ళు గుర్తింపు పొందిన రంగం నుంచి సమస్య తీవ్రతను బట్టి కొంత లేదా మూడేళ్ళు బ్యాన్ చేయాలని ఆలోచనలో ఉన్నట్టు ప్రకటించింది. మరి ఇది ఒకవేళ అమల్లోకి వస్తే తారలు ఆచితూచి అడుగు వేస్తారా లేదా తూచ్ అని తమ పాత దారిలోనే వెళ్తారా అనేది వేచి చూడాలి. తలకు రాసుకునే కొబ్బరినూనె దగ్గరి నుంచి రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకునే టూత్ పేస్టు దాకా అన్నింటికీ తారలనే వాడిపారేస్తున్నారు. మరి ఈ బ్యాన్ తీసుకొస్తే తాము ఎన్దార్స్ చేసే ప్రొడక్ట్స్ గురించి స్టడీ చేసి ఓకే చెప్తారో లేదా చట్టంలో లోసుగుల నుంచి సులభంగా బయటపడొచ్చు అని లైట్ తీసుకుంటారో మరి. కన్స్యూమర్ ప్రొటెక్షన్ బిల్ కింద గత ఏడాది ప్రవేశపెట్టిన యాక్ట్ లో ఈ కీలక మార్పులు తెచ్చే అవకాశాలు ఉన్నాయి.