2 వేల నోటు రద్దు...ఎప్పుడంటే?
లెక్కల్లో చూపని డబ్బును వెలికితీసేందుకు అమలు చేసిన పెద్దనోట్ల రద్దు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 31లోపు కొత్త రూ.2,000 నోట్లను రద్దు చేసే అవకాశాలున్నాయని అఖిల భారత స్టేట్ బ్యాంక్ అధికారుల సంఘం అధ్యక్షుడు థామస్ ఫ్రాంకో పేర్కొన్నారు.
తిరుచ్చిలో బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న థామస్ విలేకరులతో మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజానీకం తీవ్రంగా నష్టపోయిందని, మధ్య తరగతి ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుపై నల్లకుబేరులకు, కార్పొరేట్ సంస్థలకు ముందుగానే ఉప్పందిందని, దాంతో నల్లధనం పెద్దగా బయటకురాలేదని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ను కేంద్రం నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు.
తిరుచ్చిలో బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న థామస్ విలేకరులతో మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజానీకం తీవ్రంగా నష్టపోయిందని, మధ్య తరగతి ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుపై నల్లకుబేరులకు, కార్పొరేట్ సంస్థలకు ముందుగానే ఉప్పందిందని, దాంతో నల్లధనం పెద్దగా బయటకురాలేదని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ను కేంద్రం నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు.