పెళ్లి కోసం మాట్రిమోనీ వెబ్ సైట్ లో ఫోటో పెడితే.. ఒక్క రోజు నాతో పడుకుంటావా అని ఫోన్ కాల్స్
ఆమె వృతిరీత్యా డెంటిస్ట్. పెళ్లైంది. భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది. అయితే ఇటీవలే ఆమె రెండో పెళ్లి చేసుకోవాలనుకుంది. మ్యాట్రిమొనియల్ వెబ్సైట్లో ప్రకటన ఇచ్చింది. అప్పటి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. వందల కొద్దీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆ ఫోన్ కాల్స్ రావడానికి కారణం ఒకడేనని తెలిసి ఆమె కంగు తిన్నది. పోలీసులు విచారణ చేయడంతో గుట్టు రట్టయింది. ఇంతకీ అతనెవరు? ఆమెను ఎందుకు వేధించాడు? బెంగళూరులో జరిగిన యదార్థ ఘటన ఇది.
బెంగళూరుకు చెందిన ప్రియ(పేరు మార్చాం) ఓ ఆసుపత్రిలో డెంటిస్ట్గా పనిచేస్తోంది. భర్తతో విభేదాల కారణంగా కొంతకాలం క్రితం విడిపోయిన ఆమె తల్లిదండ్రుల దగ్గరే ఉంటోంది. ఆమెకు పిల్లలు లేరు. దీంతో మళ్లీ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఆరంభించాలని తల్లిదండ్రులు ఆమెకు సూచించారు. ఓ మ్యాట్రిమొనియల్ వెబ్సైట్లో ప్రియ తన ఫోటోతో పాటు వివరాలు ఉంచిది. ఆ వివరాలు చూసిన సంజీవ్ అనే వ్యక్తి ఆమెతో ఫోన్లో మాట్లాడాడు. తన తల్లిదండ్రులతో మాట్లాడి అభిప్రాయం చెబుతానని ప్రియ చెప్పింది. అతని ప్రొఫైల్ పరిశీలించిన కుటుంబ సభ్యులు సరిజోడి కాదని తేల్చేశారు. ప్రియ కూడా సంజీవ్కు ఈ విషయం చెప్పింది. సంజీవ్ కనీసం ఫ్రెండ్స్గానైనా ఉందాం అని ప్రియపై ఒత్తిడి చేశాడు. దీంతో అసలు ఉద్దేశమేంటని సంజీవ్ను ప్రియ ప్రశ్నించింది. పెళ్లి ఎలాగో చేసుకోవడం లేదు కదా కనీసం ఒక్క రోజైనా తనతో గడపాలని సంజీవ్ నీచంగా మాట్లాడాడు.
సంజీవ్ను హెచ్చరించి, మళ్లీ ఫోన్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ప్రియ చెప్పింది. సంజీవ్ ఆమె మాటను పట్టించుకోకుండా పదేపదే ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా మరో నీచానికి ఒడిగట్టాడు. ప్రియ ఫోటోను జతచేసి, శృంగారంపై ఆసక్తి ఉన్న మగవారు ఈమెను సంప్రదించడంటూ నెట్లో ఆమె వివరాలతో కూడిన ఓ యాడ్ పెట్టాడు. దీంతో అప్పటి నుంచి దాదాపు వందల మంది ప్రియకు ఫోన్ చేసి విసిగించడం మొదలుపెట్టారు. వేధింపులు తాళలేక ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సంజీవ్ బాగోతం బట్టబయలైంది.ఆ యాడ్ ఇచ్చింది సంజీవేనని పోలీసులు తేల్చారు. అతనిని అదుపులోకి తీసుకున్నారు.
బెంగళూరుకు చెందిన ప్రియ(పేరు మార్చాం) ఓ ఆసుపత్రిలో డెంటిస్ట్గా పనిచేస్తోంది. భర్తతో విభేదాల కారణంగా కొంతకాలం క్రితం విడిపోయిన ఆమె తల్లిదండ్రుల దగ్గరే ఉంటోంది. ఆమెకు పిల్లలు లేరు. దీంతో మళ్లీ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఆరంభించాలని తల్లిదండ్రులు ఆమెకు సూచించారు. ఓ మ్యాట్రిమొనియల్ వెబ్సైట్లో ప్రియ తన ఫోటోతో పాటు వివరాలు ఉంచిది. ఆ వివరాలు చూసిన సంజీవ్ అనే వ్యక్తి ఆమెతో ఫోన్లో మాట్లాడాడు. తన తల్లిదండ్రులతో మాట్లాడి అభిప్రాయం చెబుతానని ప్రియ చెప్పింది. అతని ప్రొఫైల్ పరిశీలించిన కుటుంబ సభ్యులు సరిజోడి కాదని తేల్చేశారు. ప్రియ కూడా సంజీవ్కు ఈ విషయం చెప్పింది. సంజీవ్ కనీసం ఫ్రెండ్స్గానైనా ఉందాం అని ప్రియపై ఒత్తిడి చేశాడు. దీంతో అసలు ఉద్దేశమేంటని సంజీవ్ను ప్రియ ప్రశ్నించింది. పెళ్లి ఎలాగో చేసుకోవడం లేదు కదా కనీసం ఒక్క రోజైనా తనతో గడపాలని సంజీవ్ నీచంగా మాట్లాడాడు.
సంజీవ్ను హెచ్చరించి, మళ్లీ ఫోన్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ప్రియ చెప్పింది. సంజీవ్ ఆమె మాటను పట్టించుకోకుండా పదేపదే ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా మరో నీచానికి ఒడిగట్టాడు. ప్రియ ఫోటోను జతచేసి, శృంగారంపై ఆసక్తి ఉన్న మగవారు ఈమెను సంప్రదించడంటూ నెట్లో ఆమె వివరాలతో కూడిన ఓ యాడ్ పెట్టాడు. దీంతో అప్పటి నుంచి దాదాపు వందల మంది ప్రియకు ఫోన్ చేసి విసిగించడం మొదలుపెట్టారు. వేధింపులు తాళలేక ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సంజీవ్ బాగోతం బట్టబయలైంది.ఆ యాడ్ ఇచ్చింది సంజీవేనని పోలీసులు తేల్చారు. అతనిని అదుపులోకి తీసుకున్నారు.