ఆహా.. ఏమి ఐడియారా బాబు ? పెద్దనోట్లకు బదులు బంగారం ఇచ్చి పెళ్లిపనులు చేయించుకుంటున్నా గాలి జనార్దన్ రెడ్డి
గాలి జనార్ధనరెడ్డి కుమార్తె పెళ్లిపైన కూడా పడింది. అయితే అవినీతికి మహారాజుగా, ఘనుల కేసులో నిందితుడిగా వున్న గాలి తన కూతురి పెళ్లికి అనేక రకాలైన వింతల్ని చూపించారు. దేశంలో ఎవ్వరు చేయని విధంగా పూర్వం రాజులు చేసే విధంగా తన కూతురి పెళ్లి చేస్తున్నారు. అయితే పెళ్లి కార్డులు కూడా ఎవ్వరు ఊహించని విధంగా, అత్యంత ఖరీదుపెట్టి తయారు చేయించారట. పెళ్లికి వచ్చే అతిధులకు ఆహ్వాన పత్రికలూ కూడా అందజేశారు. అయితే పెళ్లి పనులు ప్రారంభించిన తరువాత నరేంద్రమోడీ దేశంలో వున్నా పెద్ద నోట్లని రద్దు చేస్తున్నామని ప్రకటించారు. అయితే అప్పటికే 70% పెళ్లి పనులు పూర్తి చేసిన గాలి గారికి ఇప్పుడు పనివారు ఇబ్బందిగా మారారంట. పనివారికి పెద్ద నోట్లు ఇస్తే వాటిని వాళ్ళు తిరస్కరిస్తున్నారంట. అయితే అందుకు ప్రతిఫలంగా గాలి పెళ్లి పనులు చేసే వారికి డబ్బులకి బదులుగా బంగారం ఇస్తున్నారంట. పెళ్ళికి వేదికని కూడా హంపి రాజులూ వేసే సెట్ వేయిస్తున్నారంట. సినిమాని తలపించే విధంగా పెళ్లి వుండబోతుందంట.
గాలి గారి అవినీతి బండారం బయటపడిన రోజే ఆయన ఇంట్లో సుమారుగా 100కిలోల బంగారం, 175 కిలోల వెండి, వేల కోట్ల డబ్బు బయటపడింది. ఆయన కూర్చునే కుర్చీనే సుమారుగా 30కిలోల బంగారంతో చేయించారట. ఇక ఆయన వంటగది అయితే ఒక చిన్న బంగారు నగల షాపులాగే వుంటుందట. బంగారు కంచాలు, స్పూనులు, గ్లాసులు, చెంబులు అంత బంగారమే అంట. ఆయన పూజగదిలో వుండే దేవుని విగ్రహాలు పురాతన బంగారంతో పొడగబడి ఉంటాయి. వాటి ఖరీదు వందల కోట్లలో ఉంటుందని సమాచారం. అప్పట్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి రూ.45 కోట్లు విలువ చేసే బంగారంతో పొదిగిన వజ్ర కిరీటాన్ని అందజేసి అందరిచే ఔరా అనిపించుకున్నారు. అలాంటి గాలి గారు కూతురి పెళ్ళికి రూ.500 కోట్లకి పైగానే ఖర్చు చేస్తున్నారంట. గాలి గారి ఇంట్లో పనివాడి వున్నా కనీసం బంగారం అయిన వచ్చేదని కర్ణాటక ప్రజలు ఊహించుకుంటూ బాధపడుతున్నారంట. డబ్బు లేకపోతేనేమి గాలి గారు బంగారంతోనే పెళ్లిని మరింత ఘనంగా జరుపుతున్నారట.