Header Ads

నోట్ల మార్పిడి ద్వారా వచ్చే డబ్బు తో మోడీ ఏంచెయ్యబోతున్నాడో మాస్టర్ ప్లాన్ లీక్ అయ్యింది


పెద్ద నోట్ల రద్దు ద్వారా నరేంద్ర మోది ఏం సాధించదలచుకున్నారు? అని ప్రశ్నించే వాళ్ళందరికి దిమ్మతిరిగే జవాబు చెప్పటానికి మోడీ రడీకాబోతున్నాడని సమాచారం.  ప్రజలు ఇబ్బంది పడతారని తెలిసినా మోది ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అంటే మోడీ ఆనిర్ణయం తీసుకోబోయే ముందే… ఈ నిర్ణయం ద్వారా ఎంత బ్లాక్ మనీ బయటికి వస్తుంది? ఆడబ్బుని ఏంచెయ్యాలో క్లియర్ ప్లాన్ ఉందంట. ఎంతలా అంటే … అశోకుడు చెట్లు నాటెను అని ఇప్పటికి మనం ఎలా చెప్పుకుంటున్నామో… అలానే మోడీ గురించి చెప్పుకుంటాం అంట. అది ఎలానో ఒకసారి చూద్దాం.
ప్రస్తుతం చెలామణీ లో ఉన్న నల్ల డబ్బు సుమారు 4 లక్షల కోట్లని  ప్రభుత్వ అంచనా. నోట్ల మార్పిడి వలన ఈ డబ్బులో కనీసం 3 లక్షల కోట్లు చెలామణిలో లేకుండా పోతాయని లెక్కలు వేస్తున్నారు. ఈ లోటును పూడ్చడానికి ప్రభుత్వం మళ్ళీ నోట్లు ప్రింట్  చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మూడు లక్షల కోట్లలో లక్షన్నర కోట్లు రాష్ట్రాలకి కేంద్రం తిరిగి ఇచ్చేస్తుందట. మిగిలిన డబ్బుతో,  ప్రజల మనస్సులో శాశ్వతంగా నిలిచిపోయేలా నరేంద్రమోది కొన్ని పథకాలు ఆలోచిస్తున్నారని సమాచారం.

దేశంలోవ్యాప్తంగా లక్షల చెరువులు తవ్వించాలని ఆలోచిస్తున్నారంట. ఈ చెరువులతో, దేశంలో కరవు అనేదే లేకుండా చేయాలనేది మోది లక్ష్యం అంటున్నారు. చెరువుల తవ్వకం వల్ల వాననీటి ద్వారా, ప్రజల తాగునీరు, సాగునీరు అవసరాలు తీరతాయని ప్రభుత్వం ఆలోచిస్తోందట. పెరుగుతున్న జనాభాకనుగునంగా ఆహార పదార్ధాల వృద్ది లేదు, దానికి ప్రదాన కారణం , భూమి, సాగు నీరు. చెరువుల త్రవ్వకం ద్వారా ప్రజలకి నీటి వసతి కలిపిస్తే ఆహార బద్రతతో బాటు విరివిగా ఉపాది అవకశాలు మెరుగు పడుతాయి. ఒకేసారి ఇంత పెద్ద బృహత్తర ప్రాజెక్ట్ మోడీ చేస్తే… చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం.