Header Ads

బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారు వారానికి ఒకసారైనా ఈ దోశలు తినాలి.. ఎలాంటి ప్రయోజనాలో తెలుసా?!

మీరు బరువు తగ్గే ప్రయత్నంలో అవీ ఇవీ చేసి అప్ సేట్ అయి ఉన్నారా ? అధిక బరువును తగ్గించుకునేందుకు సప్పటి ఆహారాలు తిని విసుగు చెందారా ? అయితే ఇప్పుడు ‘స్వీట్’గా తినండి.. పైగా మీ లక్ష్యానికి ఏమాత్రం విఘాతం లేకుండా.. ఉదయం, సాయంత్రం ఎప్పుడైనా మీకు వీలు కుదిరినప్పుడు గోధుమ దోశలు లేదా రాగి దోశలు వేసుకుని తినండి. ఇందులో సమ్ తింగ్ స్పెషల్ ఏమంటే కింద చెప్పిన విధంగా బెల్లంతో తయారు చేసుకోండి.. రుచితో పాటు బరువు తగ్గడం సులభం అవుతుంది. మంచి ఆరోగ్యాన్ని, పోషకాలను ఇవ్వడంతో పాటు బరువు తగ్గించడంలో బెల్లం, గోధుమలు, రాగులు సహాయపడతాయని ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? వారానికి ఒక్కసారైనా ఈ దోశలు తింటే శరీరానికి చాలా రకాలుగా మేలు కలుగుతుందని డైటీషియన్లు సూచిస్తున్నారు. గోధుమ బెల్లం దోశ, రాగి బెల్లం దోశ తయారీ కూడా చాలా ఈజీ.. ఎలాగంటే..
గోధుమ తీపి దోసెలు
1 కప్పు గోధుమ పిండి
1/2 కప్పు బెల్లం పానకం
1/2 టీస్పూన్ యాలుక్కాయల పొడి
1 కప్పు నీళ్లు
కొంచెం నెయ్యి..

ఇలా చేసుకోవాలి
ఒక కప్పు నీటిని తీసుకొని కాస్త వేడి చేసి అందులో బెల్లం వేయాలి. అది కాస్త మరిగాక స్టవ్ మీది నుంచి దించేయాలి. గోధుమ పిండి, యాలుక్కాయల పొడి వేసి కలిపి ఆ పిండితో దోసెలు దోరగా వేసుకోవాలి. రుచి కావాలను కొంటే అతి తక్కువ లేదా కాస్త నెయ్యి వేసుకొని రెండు వైపులా కాల్చాలి.

రాగి తీపి దోసెలు
రాగిపిండి 250 gms
బెల్లం 150 gms
కొబ్బరి చిన్న ముక్క
వేరుశనగపప్పు 50 gms
నూనె 1 స్పూన్

ఇలా చేసుకోవాలి
ఒక గ్లాసు నీటిలో బెల్లం కరిగించాలి.వేరుశెనగపప్పును వేయించి పొడి చేసుకుని, కొబ్బరితో కలిపి ఉంచుకోవాలి. కరిగిన బెల్లంలో రాగిపిండి వేసి దోసెలపిండిలాగా కలపాలి. పెనం కాలిన తర్వాత దోసె పోసి నూనె వేసి కాలనివ్వాలి. రెండవ వైపు కూడా కాలిన తర్వాత మధ్యలో ఒక స్పూను తురిమిన కొబ్బరి, వేరుశెనగపప్పు పొడి కలిపి మడతపెట్టాలి. వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.