Header Ads

నాలుగు రూపాయల కోసం చంపేశారు


రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. పాన్ షాప్ దగ్గర నాలుగు రూపాయల చిల్లర గొడవ నిండు ప్రాణాలను బలి తీసుకుంది. హయత్ నగర్ బంజారా కాలనీలో నివాసం ఉంటున్న రాజేష్ రాత్రి 9గంటలకు సిగరెట్ కోసమని పాన్ షాప్ కి వెళ్ళాడు. సిగరెట్ తీసుకున్న తరువాత రాజేష్ రూ.100 నోటు ఇవ్వగా చిల్లర లేదని పాన్ షాప్ వ్యక్తి చెప్పాడు. దీంతో రాజేష్ 10 రూపాయలు ఇవ్వగా సిగరెట్ 14 రూపాయలు.. రూ.10 ఎలా ఇస్తావని గట్టిగా అడిగాడు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి గొడవకు దారి తీసింది. అదే సమయంలో అక్కడకి వచ్చిన పాన్ షాపు యజమాని అప్సి స్నేహితులు రాజేష్ పై దాడికి దిగారు. వారి నుంచి తప్పిOచుకున్న రాజేష్  రోడ్డు దాటి పరిగెత్తినా వదలకుండా  వెoబడిoచి మరీ పట్టుకొచ్చి చితక బాదారు. మళ్ళీ వారి నుంచి తప్పిoచుకున్న రాజేష్ భయంతో రోడ్డు దాటి పరిగెడుతుoడగా లారీ ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు. మొదటగా రోడ్డు ప్రమాదం అనుకున్న పోలీస్ లు లోతుగా దర్యాప్తు చేసి కొందరు దాడి చెయ్యడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుoదని నిర్ధారించుకున్నారు.  CC కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి హత్యా నేరం  సెక్షన్ (304) కింద కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హయత్ నగర్ పరిధిలో ఈ కొద్ది రోజుల్లోనే ఇదే తరహాలో జరగడం ఇది రెండో ఘటన.