చిరంజీవి లాంటి వ్యక్తి ఇలా చేయటం దారుణం.. సిగ్గుపడాల్సిన విషయం.!!
అవమానం అంటే.. నీ ముక్కు బాగా లేదు, నీ మూతి బాగా లేదు కాదు.ఇలాంటివి కొన్ని విషయాలతో పోల్చితే అసలు అవమానాలే కాదు. అవమానం అంటే ఎలా ఉంటుందో తెలుసా.. మీలో ఎవరు కోటీశ్వరు షోలో ఘాజీ డైెరెక్టర్ కి జరిగిన విధానం నిజంగా అవమాన కరం. ఎందుకంటే.. పిలవకపోయినా పర్వాలేదు. కానీ పిలిచి అలా అవమాన పరచటం దారుణం. అందులో చిరంజీవి లాంటి వ్యక్తి,అన్నీ తెలిసిన మెగా స్టార్ ఇలా చేయటం ఇంకా జీర్ణించుకోలేని విషయం.
గత వారం నుంచి ఒక్క సినిమా గురించే చర్చ జరుగుతుంది. అదే ఘాజీ. ఆ సినిమా తీసిన విధానం, స్టారీ అంతా ఇంటర్ నేషన్ స్ధాయిలో ఉందంటూ.. తెలుగులో కూడా ఓ మగాడు వచ్చాడురా అని చెప్పుకుంటున్నారు. అది తీసింది ఓ మాములు వ్యక్తి పేరు సంకల్ప్. ఇప్పుడు ఈ డైరెక్టర్ ఎక్కడికి వెళ్లిన అరుదన గౌరవం లభిస్తుంది. కానీ మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి పొగ్రాంలో మాత్రం అవమానం జరిగింది.
ఈ షోకి రానా,తాప్సి,సంకల్ప్ లను పిలిచారు. అక్కడ రంగులేసుకొని తెరమీద దర్శకుడు చెప్పినట్లుగా చేసి.. కాస్త స్కిల్ చూపించే వాళ్లు రానా, తాప్సి అతిధులయ్యారు . అదే క్రియేటివిటీతో.. అలాంటి సినిమా తీసి,అంత ఆధ్బుతాన్ని సృష్టించిన సంకల్ప్ మాత్రం ప్రేక్షకుల గ్యాలరీకి పరిమితమయ్యాడు . దీంతో ఈ విషయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కడుపులో ఎంత విషం పెట్టుకొని బ్రతుకుతున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు . పక్కనోడి క్రియేటివిటీని తమ ప్రతిభగా చెప్పుకునే ఇలాంటి వాళ్లకా మన పోరగాళ్ళు మళ్లీ ఫాన్సా అంటూ గొడవ చేస్తున్నారు. సంకల్ప్ ,ఎవడు మెచ్చుకున్నా మెచ్చుకోకున్నా నీపేరు ప్రపంచం అంతా మారుమ్రోగుతుంది . ఇలాంటి వాళ్ల దగ్గరికెళ్లి అగౌరవ పడవద్దని చెబుతున్నారు. చివరికి చిరంజీవి కూడా పట్టించుకోవటం చాలా బాధాకరమని అనుకుంటున్నారు.