Header Ads

నడిరోడ్డుపై రూ. 13 లక్షలు... చూసినా ఎవరూ ముట్టుకోలేదు! ఇది నిజంగా ఓ విచిత్ర సంఘటన.


ఓ మహిళ తనకు డబ్బు అక్కర్లేదని దాదాపు 20 వేల డాలర్ల (దాదాపు 13 లక్షల రూపాయలు)ను నడిరోడ్డు మీదకు విసిరేసింది. అలా రోడ్డు మీద పడి ఉన్న డబ్బును గమనించి తమకు కూడా అక్కర్లేదని పక్కకు తప్పుకుని వెళ్లిపోయారు పాదచారులు. ఇది ఇతర దేశాల వారికి ఆశ్చర్యం కలిగించే వార్తేమో కానీ, దక్షిణ కొరియా వాసులకు మాత్రం ఆశ్చర్యం కలిగించే వార్త కాదు. ఎందుకంటే దక్షిణ కొరియాలో ఉద్దేశ పూర్వకంగా దొంగతనం చేయడమే కాదు.. తమది కాని వస్తువును తీసుకున్న వారు కూడా శిక్షార్హులే. దీంతో ఇతరులెవరూ ఆ డబ్బు జోలికి వెళ్లలేదు.

అయితే ఇంతకీ ఆ మహిళ డబ్బు ఎందుకు విసిరిందో తెలుసా? ఆ మహిళ పేరిట బ్యాంకులో ఉన్న ఈ డబ్బు గురించి ఆమె కొడుకు, భర్త కొన్నాళ్లగా వేధిస్తున్నారట. అందుకే వాళ్లకు ఈ ధనం దక్కడం ఇష్టం లేక.. ఇతరులకు అందిద్దామనే ఉద్దేశంతో ఇలా రోడ్డు మీదకు విసిరేసిందట. అయితే ఆ డబ్బును ఇతరులెవరూ కనీసం ముట్టుకోలేదు. మొత్తానికి చట్టాన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతున్న దక్షిణ కొరియా వాసులు సూపర్‌ కదూ!