Header Ads

నవంబర్‌లో 15 రోజులు భూమంతా చీకటే

హైదరాబాద్‌: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పేరుతో వచ్చిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ అయ్యింది. దేశాధినేతల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ మాట్లాడుకుంటున్న విషయం. భూమంతా చీకటిమయం కాబోతోంది. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా 15 రోజులు. మొత్తం భూమి.. చిమ్మచీకటి కానుందంట. గ్లోబల్ వైబ్ సైట్స్ కథనం ప్రకారం.. 15 నవంబర్ 2016 నుంచి 30 నవంబర్ 2016 వరకు భూమి చీకట్లోకి వెళుతుందంట. నాసా సైంటిస్టులు ఈ విషయాన్ని చెప్పారంట. ఇప్పటికే అమెరికా దేశాధ్యక్షుడు ఒబామాకు దీనిపై ఏకంగా వెయ్యి పేజీల రిపోర్ట్ ను అందించారంట నాసా హెడ్ చార్లెస్ బోల్డెన్.

నవంబర్ బ్లాక్ అవుట్ గా పిలిచే ఇది.. నవంబర్ 15వ తేదీ ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి నవంబర్ 30 సోమవారం సాయంత్రం 4.15 వరకు ఉంటుందని చెబుతున్నారు. 10 లక్షల ఏళ్లకు ఒక్కసారి ఇలా జరుగుతుందని సైంటిస్టులు తెలుపుతున్నారు. శుక్రగ్రహం, గురు గ్రహాల మధ్య జరిగే ఖగోళ పరిణామాలతోనే ఇలా భూమి చీకటిమయం అవుతుందని వెబ్ సైట్స్ కథనం. అంతేకాదు నవంబర్ 15వ తేదీ తెల్లవారుజామున 2 గంటల 58 నిమిషాల నుంచి సూర్యుని వెలుతురు కూడా తగ్గుతుందట. బ్లాక్ అవుట్ ఎఫెక్ట్ భూమిపై చూపించనుంది. దీంతో 8 నుంచి 9 డిగ్రీల వరకు టెంపరేచర్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయట.
sources : http://www.isportstimes.com/