అక్కడ ఆడవారిని అంటుకుంటే ఇక అంతే..
సమసమాజ స్థాపన అన్నది ఓ కల. అందుకు నిలువెత్తు నిదర్శనమే ఈ పాఠశాల. పేరుకు దీనిని అరుంధతీరాయ్ (ప్రముఖ సామాజికవేత్త, రచయిత) తల్లి మేరిరాయ్ నెలకొల్పవచ్చు గాక. పాపం! ఆమె గారు మాత్రం ఏం చేస్తారు? బుద్ధి భూమిని ఏలమంటే.. కర్మ గాడిదెక్కి ఊరేగమందం ట! కొట్టాయంలో స్థాపించిన ఈ పల్లి కూడమ్ పాఠశాలలో నెలకొల్పిన పాఠశాలలో వింత నిబంధనలు అమలవుతున్నాయ్.
ఇక్కడి ప్రాంగణంలో అమ్మాయిలు, అబ్బాయిలు కనీసం మీటర్ దూరం ఉండి వారి వారి పనులు చూసుకోవాలని యాజమాన్యం ఆదేశించింది. అంతేకాకుండా సాధారణంగా పాఠశాలలో తరగతుల వారీగా సెక్షన్లు ఉంటే, ఈ పాఠశాలలో మాత్రం అమ్మాయిల వారీగా, అబ్బాయిల వారీగా సెక్షన్లు ఉన్నాయి. దీంతో పాటు సీనియర్ విద్యార్ధులు ఎవరూ జూనియర్లతో మాట్లాడకూడదని కూడా ఆంక్షలు విధించారట.దీనిపై స్కూల్ యాజమాన్యం మాత్రం.. పాఠశాలలో తాము అమలు చేస్తోన్న నిబంధనల వల్ల బాలబాలికల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందని చెబుతూ సమర్థించుకుం టోంది.కొన్ని కార్యక్రమాలలో మాత్రం బాలబాలికలు ఉమ్మడిగా పాల్గొనే అవకాశం ఉందని చెబుతోంది.దీనిపై పాఠశాల ప్రిన్సిపాల్ ను ప్రశ్నించేందుకు మీడియా ప్రయత్నించగా ఆయన స్పందించేందుకు నిరాకరించారు.మొత్తానికి యాజమాన్యం తీరుపై సామాజికవేత్తలు మండిపడుతున్నారు.ఇప్పటికైనా పద్ధతి మార్చుకొమ్మని హెచ్చరిస్తున్నారు.
ఇక్కడి ప్రాంగణంలో అమ్మాయిలు, అబ్బాయిలు కనీసం మీటర్ దూరం ఉండి వారి వారి పనులు చూసుకోవాలని యాజమాన్యం ఆదేశించింది. అంతేకాకుండా సాధారణంగా పాఠశాలలో తరగతుల వారీగా సెక్షన్లు ఉంటే, ఈ పాఠశాలలో మాత్రం అమ్మాయిల వారీగా, అబ్బాయిల వారీగా సెక్షన్లు ఉన్నాయి. దీంతో పాటు సీనియర్ విద్యార్ధులు ఎవరూ జూనియర్లతో మాట్లాడకూడదని కూడా ఆంక్షలు విధించారట.దీనిపై స్కూల్ యాజమాన్యం మాత్రం.. పాఠశాలలో తాము అమలు చేస్తోన్న నిబంధనల వల్ల బాలబాలికల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందని చెబుతూ సమర్థించుకుం టోంది.కొన్ని కార్యక్రమాలలో మాత్రం బాలబాలికలు ఉమ్మడిగా పాల్గొనే అవకాశం ఉందని చెబుతోంది.దీనిపై పాఠశాల ప్రిన్సిపాల్ ను ప్రశ్నించేందుకు మీడియా ప్రయత్నించగా ఆయన స్పందించేందుకు నిరాకరించారు.మొత్తానికి యాజమాన్యం తీరుపై సామాజికవేత్తలు మండిపడుతున్నారు.ఇప్పటికైనా పద్ధతి మార్చుకొమ్మని హెచ్చరిస్తున్నారు.