Header Ads

పళ్ళపై పేరుకున్న పాచిని చిన్న చిట్కాతో నిమిషంలో వదిలించుకోవచ్చు..

ముఖంలో మరో అందమైన భాగం అందమైన పలువరుస ఎంతో అందంగా ఉంటుంది. అయితే పలువరుస అందంగా ఉన్నా, పళ్ళు పచ్చగా గార పట్టి ఉంటే నలుగురిలో హాయిగా నవ్వలేము. అందుకే, ఎప్పుడూ పళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్ గా డెంటిస్ట్ ను కలుస్తుంటారు. రోజులో రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చేస్తుంటారు. అందుకే వారి దంతాలు తెల్లగా మిళమిళలాడుతూ ఆరోగ్యం ఉంటాయి. అయితే మరొకొందరికి ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్న వారి దంతాలు అంత అందంగా కనబడవు, పసుపుపచ్చగా కనబడుతుంటాయి.

మరి ఈ సమస్యకు పరిష్కారం ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తోనే కేవ‌లం 3 నిమిషాల్లోనే మీ దంతాల‌ను తెల్ల‌గా మారేలా చేయ‌వచ్చు. పచ్చగా ఉన్న దంతాలను తెల్ల‌గా క‌నిపించేలా చేసేందుకు కేవ‌లం రెండు ప‌దార్థాల‌ను తీసుకుంటే చాలు.
అవే బేకింగ్ సోడా, నిమ్మ‌ర‌సం. ఒక చిన్న‌పాటి బౌల్‌లో ఒక స్పూన్ బేకింగ్ సోడాను తీసుకోవాలి. దానికి స‌గం నిమ్మ‌కాయ నుంచి తీసిన రసాన్ని కొద్ది కొద్దిగా క‌ల‌పాలి. చివ‌ర‌కు బేకింగ్ సోడా నిమ్మ‌ర‌సంలో పార‌ద‌ర్శ‌కంగా క‌రిగి ఓ ద్రావ‌ణంలా త‌యార‌వుతుంది. ఈ ద్రావ‌ణంలో కొద్ది భాగాన్ని..

చేతి వేలిపై తీసుకుని దాంతో దంతాల‌పై బ్ర‌ష్ చేసిన‌ట్టు చేయాలి. అనంత‌రం నీటితో నోటిని పుక్కిలించాలి. అంతే, క్ష‌ణాల్లోనే దంతాలు తెల్ల‌గా మారుతాయి.

తులసి టూత్ పౌడర్ తయారీ : 
తాజాగా ఉండే తులసి ఆకులను తీసుకొని నీడలోనే ఎండబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా ఎండిన తర్వాత, ఆకును మెత్తగా నూరి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఉపయోగించి బ్రష్‌చేసి మీ దంతాలపై పసుపు రంగును నిర్మూలించుకోండి. తులసి పౌడర్ ఉపయోగించి చేతి వేలితో కూడా బాగా రుద్దడం వల్ల ఉత్తమ ఫలితం ఉంటుంది. ఇంకా, మీ రెగ్యులర్ పేస్ట్‌కు తులసి పౌడర్‌ను జతచేసి, బ్రష్ చేసుకోవచ్చు. తద్వారా మీ పళ్ళు మెరిసిపోవడమే కాకుండా, ఇతర దంత సమస్యలను కూడా అరికట్టడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది.

మరిన్ని టిప్స్ : 
* ఉప్పులో కొన్ని చుక్కలు నిమ్మరసం వేసి దానితో పళ్లు రుద్దుకొని కొద్దిసేపటి తర్వాత కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల పళ్లకుండే పసుపు రంగు పోతుంది.
* ప్రతిరోజూ బత్తాయి తొక్కలతో పళ్లు రుద్దుకుంటే వాటిపై ఏర్పడే ఎటువంటి మచ్చలైనా సులభంగా పోతాయి. అంతేకాకుండా చిగుళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
* లవంగాలను పొడిచేసి దానితో పళ్లు రుద్దుకోవాలి. ఇలా చేయడంవల్ల పళ్లు తళతళా మెరవడమే కాకుండా బలంగా కూడా ఉంటాయి.
* తులసి ఆకుల్నిఎండబెట్టి పొడి చేసి దీనితో ప్రతిరోజూ బ్రష్‌ చేస్తే పళ్లపై వచ్చే పసుపు మరకలు తొలగిపోతాయి. అంతేకాకుండా పళ్లకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా పోతాయి.
* స్ట్రా‌బెర్రీలను పేస్టులా చేసి దానిలో చిటికెడు తినేసోడా వేయాలి. ఈ మిశ్రమంతో పళ్లను రుద్దుకోవాలి. స్ట్రా‌బెర్రీలో ఉండే విటమిన్‌-సి, యాసిడ్‌లు పళ్లకు తెల్లటి రంగు రావడానికి ఉపయోగపడతాయి.