కొన్ని పదార్థాలను కలిపి తింటే, మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. వీటిని కలిపి తింటే ఆహరం విషంలా మారుతుంది
అందుకే ఈ ఆహార నియమాలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించండి.
- తేనే మరియు నెయ్యి కలిపి తినకూడదు. ఆ రెండిటి కలయిక విషపూరితం అవుతుంది.
- పెరుగు లేక మజ్జిగను అరటి పండు తో కలిపి తినకూడదు.
- అన్నాన్ని పండ్లతో (fruits) కలిపి తినకూడదు. అలా తినడం వల్ల పండ్లలోని మినరల్స్ తగ్గిపోతాయి.
- కూరగాయలతో కలిపి వెన్న కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం.
- చేపల కూర తిన్నవెంటనే పాలు కానీ, పెరుగు కానీ తినకూడదు. అలా తింటే కుష్టు రోగం వంటి దీర్ఘకాలిక జబ్బులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి.
- లావుగా ఉన్నవారు బియ్యం తో వండినవి కాకుండా గోధుములతో చేసిన ఆహార పదార్ధాలు తీసుకోవడం మంచిది..
- ఆస్తమా రోగులు టమోటా, గుమ్మడికాయ , ముల్లంగి లను, వారు తీసుకొనే ఆహారంలో వాడకూడదు. అలాగే వారు తల మీద ఎక్కువ తేమను కూడా ఉంచుకోవడం మంచిది కాదు.
- మొలలు ఉన్నవారు గుడ్లు, మాంసం తినకూడదు.
- నెయ్యిని రాగి పాత్రలో ఉంచి తినకూడదు.
- పొద్దునే బెడ్ కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు. పొద్దునే మంచి నీరు తాగిన తర్వాత తాగొచ్చు.
- అల్సర్ వ్యాదితో భాద పడుతున్నవారు కారాన్ని తినకూడదు.
- చర్మ వ్యాధులు ఉన్నవారు పొట్ల కాయ, పల్లీలు, ఎండు చేపలు, చిక్కుడు కాయలు తినకూడదు.
- నువ్వుల నునే తో గోధుమ కి చెందిన వంటల్ని చెయ్యకూడదు.
- మోకాళ్ళ నొప్పులతో ఉన్నవారు మాంసం , గుడ్లు తో చేసిన వంటలు తినకూడదు. తింటే నొప్పులు ఎక్కువవుతాయి.
- వీటిని వీలైనంత వరకు గుర్తుంచుకొని పాటించండి.. ఆరోగ్యం బాగా చూసుకోండి.
ఆరోగ్యమే మహా భాగ్యం కదా!!