Header Ads

5వందల నోట్లు వచ్చేశాయ్..ఇక చిల్లర కష్టాలు అందరికి తీరినట్టే!!


పాత నోట్లను రద్దు చేసిన క్రమంలో ఇప్పటికే ఆర్బీఐ  2వేల నోట్ ను విడుదల చేసింది. తాజాగా 5వందల నోట్లను కూడా బ్యాంకుల్లోకి రిలీజ్ చేసింది. ఈ నోట్లును మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఆదివారం పంపిణీ చేసింది. రెండు రోజుల్లోగా దేశంలోని అన్ని బ్యాంకులకు ఈ నోట్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి 5వందల నోట్లు చలామణిలోకి వస్తున్నవి. ఈ నోట్లు స్టోన్ గ్రే  కలర్ లో ఉన్నాయి. ఈ రోజు 50 లక్షల 500ల నోట్లను విడుదల చేసింది ఆర్బీఐ. 16న మరో 50 లక్షల 5వందల నోట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. కొత్త ఐదువందల నోట్ల రాకతో ప్రజల కష్టాలు తీరనున్నాయి.