Header Ads

ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు స్కూల్ లో అమ్మాయిలతో నగ్న స్నానాలు లైంగిక వేధింపులు


ఓ ప్రభుత్వ ఎయిడెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ఉపాధ్యాయుడు సభ్య సమాజం తలదించుకునే దారుణానికి ఒడిగట్టాడు. విద్యార్థినులను అర్ధరాత్రి సమయంలో నగ్నంగా స్నానం చేయాలని ఆదేశించడమే కాకుండా వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మహరాష్ట్రలోని బీడ్ జిల్లాలో చోటు చేసుకుంది. కాగా, ఈ కీచకుడు గత ఐదు నెలలుగా ఇదే తంతు కొనసాగిస్తున్నాడని ఓ బాధితురాలు బయటకు చెప్పడంతో అతడి పైశాచికం వెలుగు చూసింది.

చిన్నారుల హక్కుల సంస్థ ఫిర్యాదు మేరకు షిర్పూప్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో మొత్తం 120 మంది విద్యార్థులు ఉండగా, వారిలో 36 మంది బాలికలు అని జిల్లా ఎస్పీ జి.శ్రీధర్ వెల్లడించారు. అబ్బాయిలు, అమ్మాయిలకు వేర్వేరుగా నివాస భవనాలు ఉన్నాయని పేర్కొన్నారు. స్కూల్లో మొత్తం 8 మంది పురుష టీచర్లు ఉండగా, వారిలో ప్రతీ వారం ఇద్దరు చొప్పున స్కూల్లోనే బస చేస్తుంటారని తెలిపారు. స్కూల్లో వార్డెన్ లేరని, మహిళా టీచర్ ఒక్కరూ లేరని తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు.