రెండు వేల రూపాయల దొంగ నోట్లు చెలామనిలోకి వచ్చేశాయి! ఇవిగో ఇక్కడ ఉల్లిపాయలు కూడా కొన్నారు.
తరువాత అక్కడికి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి రూ.2,000 నకిలి నోట్లు ఆ యువకులకు ఇచ్చి ఉల్లిపాయలు తీసుకు వెళ్లారు. తరవాత ఆ రూ.2,000 నోట్లకు చివరిలో కత్తెరతో కత్తిరించిన విషయం గుర్తించిన అశోక్ షాక్ అయ్యి…పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నకిలి నోట్లు తయారు చేసిన వారి కోసం గాలిస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన రూ.2,000 నోట్లు చెల్లుబాటులోకి వచ్చిన రెండు రోజుల్లోనే నకిలి నోట్లు తయారు చెయ్యడంతో ప్రజలు హడలిపోతున్నారు. ఒక మంచి ఆలోచన ఆచరణలో పెట్టడం చాలా కష్టం గాని, అదే అవినీతి అవలంభించడం చాలా ఈజీగా జరిగిపోతుంది…