తమ్ముడని పరిచయం చేసింది.. వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో ఎవరికీ అనుమానం రాలేదు.. ఓ రోజు పడక గదిలో వీరిద్దరిని చూసి షాక్ అయ్యారు
అక్కా అంటూ వచ్చిన ఆ యువకుడు పెళ్లైన ఆ యువతితో ఇంట్లోనే అక్రమ సంబంధం కొనసాగించాడు. దీంతో భర్త పరాయివాడు అయిపోయాడు. ఇదేంటని ప్రశ్నిస్తే చివరకు భర్తను కాదని ఆ తెరచాటు ప్రియుడితోనే వెళ్లిపోయింది యువతి.
వివరాల్లోకి వెళ్తే.. బిహార్ రాష్ట్రంలోని ముజాఫర్పూర్ జిలా, మోతీపూర్ గ్రామానికి చెందిన ఆ యువతికి 8 నెలల క్రితం పెళ్లైంది. భార్యభర్తలు ఇద్దరూ బాగానే కాపురం చేసుకుంటున్నారు. కానీ ఆ యువతి తనువు భర్త దగ్గరే ఉన్నా, మనసు మాత్రం ఇంకా తన ప్రియుడి దగ్గరే ఉండి పోయింది. భర్త బయటకు వెళ్లగానే ప్రియుడితో గంటలకొద్దీ ఫోన్లో మాట్లాడేది.
ఆ ప్రియుడు కూడా తరచూగా ఇంటికి వచ్చేవాడు. ఇంట్లో వాళ్ళకి తమ్మడు అవుతాడని చెప్పింది. దీంతో పాపం వారు కూడా నమ్మేశారు.
ఇంకేం ఉంది సోదరుడిగా చెప్పుకుంటూ ఇక ఆ ఇంట్లోనే ఆమెతో గడిపేవాడు. ఇలా వీరి అక్రమ సంబంధం సాగింది. కానీ ఎంతకాలం ? ఎప్పటికైనా నిజం బయట పడుతుంది కదా చివరికి అదే జరిగింది.
గత గురువారం రోజు బయటకు వెళ్లిన భర్త ఏదో పని కారణంగా మధ్యలో ఇంటికి రాగా, పడక గదిలో వీరిద్దరూ శృంగారం చేసుకోవటం భర్త కంట పడింది. దీంతో ఇద్దరినీ ఇంటి నుంచి బయటకు లాగారు. స్థానికులు ఇదేం పాడుబుద్ధి అని ఇద్దరికీ దేహశుద్ధి చేశారు. ఈ వ్యవహారం గ్రామ పెద్దల పంచాయితీ వరకు వెళ్లింది.
ఇద్దరి వాదనలు పూర్తయిన తర్వాత ఆ యువతి తనకు ప్రియుడే కావాలి, భర్త అవసరం లేదు అని చెప్పింది. భర్తను అడగగా, ఈమె నాకు అవసరం లేదు. తనకే ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పాడు. దీంతో భర్త సమక్షంలోనే వారిద్దరికి పంచాయితీ పెద్దలు పెళ్లి జరిపించారు. అయితే పంచాయితీ పెద్దలు ఈ విధంగా పెళ్లి జరపటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.