ఉదయాన్నే పరగడుపున దానిమ్మ జ్యూస్ 3 ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు
అరగ్లాసు దానిమ్మ రసంతోపాటు మూడు కర్జూరాలు తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. సాధారణంగా దానిమ్మ మరియు ఖర్జూరం రెండింటిలో కూడా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి కాని ఈ రెండింటిని కలిపి తీసుకుంటే అద్భుతాలు జరుగుతాయి...
* గింజలు ఒలుచుకుని తినడం కొద్దిగా కష్టం కానీ, దానిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎర్రగా నిగనిగ లాడుతూ కంటికి ఇంపుగా కనిపించేదానిమ్మ గింజలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి.
* ఏపండయినా పండుగానే బాగుంటుంది. కానీ ఖర్జూరపండు ఎండినా రుచే. నట్ గా మారిన ఎండు ఖర్చూరంలోని నీళ్లన్నీ ఆవిరైపోవడంతో అది మరింత తియ్యగా ఉంటుంది. ఈ పండులో ఔషధ గుణాలు కూడా ఎక్కువ. వీటిని రోజూ తింటే రోగ నిరోధకశక్తి ని పెంచే గుణం మెండుగా వుంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు..
* కనీసం వారానికి మూడు సార్లు అయినా ఒక గ్లాస్ ఇంట్లోనే తయారుచేసుకున్న దానిమ్మ జ్యూస్, ఒక మూడు ఖర్జూరాలు కలిపి తినాలి. దీని వలన మన శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.
* ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల మన శరీరానికి అత్యంత శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ల సమాహారం ఇస్తుంది. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ పని పట్టి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. ఎప్పుడు యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
* దానిమ్మ ఖర్జూరం తీసుకోవడం వల్ల గుండెకు రక్త ప్రసరణ బాగా జరిగి గుండె (హృదయము) కు మేలు చేస్తుంది. మీ గుండెను ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంచుతుంది.
దానిమ్మ రసములోని రసాయనాలు ‘కొలెస్టరాల్ ‘ వల్ల జరిగే ప్రమాదాల జోరును తగ్గిస్తుంది. ఖర్జూరంలో ఉండే యాంటిఆక్సిడెంట్స్ ధమనులలో పేరుకు పోయిన కొవ్వును ఖరిగించి కొలెస్ట్రాల్ ను నాశనం చేస్తుంది.
* దానిమ్మ రసం తీసుకోవడం వల్ల రక్తానికి కావలసినంత హిమోగ్లోబిన్ అందుతుంది,, అల్లాగే ఖర్జూరం తీసుకోవడం వల్ల ఒంట్లో నీరసం తగ్గి రక్తాన్ని అందిస్తుంది.
మూత్రం సాఫీగా కానివారికి ఖర్జూరపండు పెడితే మూత్రం సాఫీగా జారీ అవుతుంది.
మూత్రపిండాలలో రాళ్లు కరగాలంటే ఖర్జూరపండు తరచుగా తినాలి.