Header Ads

20 వేలకే హీరో కంపెనీ స్కూటీ !! అందరికి షేర్ చేయండి!!

ప్రముఖ టూవీలర్ సంస్థ హీరో గ్రూప్ నుంచి మరో అద్భుత ఆవిష్కరణ జరిగింది. ఇండియాలో వాహనదారులకు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను హీరో కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు, అతి తక్కువ ధరకే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంలోకి రానుంది. హీరో ఫ్లాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 19,990 రూపాయలు. సుదూర ప్రాంతాలు వెళ్లాలంటే కష్టమే కానీ దగ్గరదగ్గర తిరగాలంటే ఈ స్కూటర్ ఉత్తమమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 48-వోల్ట్ 20ఏహెచ్ వీఆర్‌ఎల్ఏ బ్యాటరీ సామర్థ్యంతో రూపొందించిన ఈ స్కూటర్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు 65 కిలోమీటర్లు తిరగొచ్చట. ఈ స్కూటర్ గరిష్ట వేగం 25 కిలోమీటర్లు. ఈ స్కూటర్ బరువు కేవలం 87 కిలోలు. మెగ్నీషియం ఎల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ ఈ స్కూటర్ ప్రత్యేకత. హీరో ఎలక్ట్రిక్ సీఈవో గ్లోబల్, సోహిందర్ జిల్ ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.