థైరాయిడ్ సమస్యకు పరిష్కారం కేరళీయ ఆయుర్వేదం ! అందరికి తెలిసేలా షేర్ చేయండి!!
థైరాయిడ్ సమస్య ఉందని తెలియగానే చాలా మంది ఆందోళన చెందుతుంటారు. జీవితాంతం మందులు వేయాల్సి వస్తుందని భయపడుతుంటారు. నిజానికి థైరాయిడ్ గ్రంథి పనితీరులో తేడా వస్తే దాని మొత్తం జీవక్రియలపై పడుతుంది. అయితే కేరళీయ ఆయుర్వేద చికిత్స ద్వారా థైరాయిడ్ లోపాలను సరిచేసుకునే వీలుందని అంటున్నారు డాక్టర్ మంజుషా.
థైరాయిడ్ గ్రంథి పనితీరులో తేడా వల్ల థైరాయిడ్ సమస్య తలెత్తుతుంది. ముఖ్యమైన జీవక్రియల నిర్వహణలో థైరాయిడ్ గ్రంథి కీలకపాత్ర పోషిస్తుంది.
థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోతే మొత్తం జీవక్రియలపైనే ప్రభావం పడుతుంది. అధిక బరువు, డిప్రెషన్, ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడం జరుగుతుంది. గుండె జబ్బులు, యాంగ్జైటీ, హెయిర్లాస్, శృంగార సమస్యలు, సంతానలేమి, కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ పనితీరులో తేడా ఉందని తేలినట్లయితే వెంటనే చికిత్స తీసుకోవాలి. థైరాయిడ్ సమస్యలో రెండు రకాలుంటాయి.
హైపోథైరాయిడిజమ్ : థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గిపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.
హైపర్థైరాయిడిజమ్ : థైరాయిడ్ గ్రంథి అధికంగా పనిచేయడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.
లక్షణాలు
అలసట : 8 నుంచి 10 గంటలు పడుకున్నా అలసటగా ఉంటుంది. సాయంత్రంకల్లా అలసిపోతారు. ఫిజికల్ యాక్టివిటీ ఏమాత్రం చేయలేరు. ఏ కొంచెం చిన్న పనిచేసినా బాగా అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది.
బరువులో తేడా : ఆకస్మికంగా బరువు పెరగడం లేదా ఎంతకీ బరువు తగ్గకోపోవడం హైపోథైరాయిడిజమ్ను సూచిస్తుంది. మంచి ఆహారం తీసుకుంటున్నా ఆకస్మికంగా బరువు తగ్గిపోవడం హైపర్థైరాయిడిజమ్ను సూచిస్తుంది. డిప్రెషన్, యాంగ్జైటీ, తొందరగా కోపం రావడం, చిన్న విషయాలకే భయపడటం, టెన్షన్కి గురికావడం జరుగుతుంది.
సంతానలేమి : హైపోథైరాయిడిజమ్లో ఋతుస్రావం అధికంగా, ఎక్కువసార్లు అవుతుంది. హైపర్థైరాయిడిజమ్లో ఋతుస్రావం తక్కువగా, చాలా రోజులకు ఒకసారి అవుతుంది.
జుట్టు, చర్మం : జుట్టు రాలిపోవడం, పొడిబారినట్లుగా ఉండటం, జుట్టు పగలడం, చర్మం పొడిబారి దురద పెట్టడం జరుగుతుంది. మెడ భాగంలో అసౌకర్యంగా ఉండటం, మాటలో తేడా వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కండరాలు, జాయింట్ పెయిన్స్, పిక్కలు పట్టడం వంటివి కూడా ఉంటాయి. వీటిలో ఏ లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలి.
రక్తపరీక్షలు
టి3, టి4, టిఎస్హెచ్ హార్మోన్ లెవెల్స్ను తెలుసుకునేందుకు రక్తపరీక్ష చేయాలి.
చికిత్స
థైరాయిడ్ సమస్యకు అల్లోపతిలో శాశ్వత పరిష్కారం లేదు. థైరాక్సిన్ సప్లిమెంట్లను మాత్రమే ఇస్తారు, కానీ అది శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వదు. గ్రంథి పనితీరు బాగయ్యేలా చికిత్స ఇవ్వరు. అయితే కేరళీయ అయుర్వేద వైద్యంలో శాశ్వత పరిష్కారం లభిస్తుంది. లక్షణాలను తగ్గించేందుకు మందులు ఇవ్వడం కాకుండా వ్యాధి మూలకారణాన్ని తొలగించే విధంగా చికిత్స ఉంటుంది. థైరాయిడ్ వ్యాధితో సహా ఇతర అన్ని వ్యాధులు రావడానికి కారణం వాత, పిత, కఫ దోషాలే కారణం.
మానసిక ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మెటబాలిజమ్పై ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల క్రమంగా త్రిదోషాలు హెచ్చుతగ్గులకులోనై థైరాయిడ్ సమస్యలతో పాటు వివిధ సమస్యలకు కారణమవుతాయి. ఆయుర్వేద చికిత్స ద్వారా దోషాలను సవరించడం, మెడికల్ హిస్టరీని పరిశీలించి అందుకు అనుగుణమైన చికిత్సను ఇవ్వడం జరుగుతుంది. కేరళీయ ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు, ప్రత్యేకమైన ఆయిల్ ట్రీట్మెంట్స్ హెచ్చుతగ్గులకు లోనయిన త్రిదోషాలను సమస్థితికి తీసుకువస్తాయి.
చికిత్స వల్ల లాభాలు
థైరాయిడ్ గ్రంథిని యాక్టివేట్ చేయడంతో పాటు, పనితీరు మెరుగుపడుతుంది. ఆకలి పెరుగుతుంది. బరువు, గ్యాస్ట్రిక్ సమస్యలు, సంతానలేమి సమస్యలు దూరమవుతాయి. అధిక బరువు తగ్గడంతోపాటు అందమైన శరీరాకృతిని సొంతం చేసుకోగలుగుతారు.
కొవ్వుతగ్గడంతో పాటు కండరాలు బలంగా తయారవుతాయి. రక్తసరఫరా మెరుగవుతుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు అల్లోపతి మందులతో పాటు ఆయుర్వేద మందులు వేసుకోవచ్చు. మెల్లమెల్లగా అల్లోపతి మందుల డోసు తగ్గిస్తూపోతే ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే థైరాయిడ్ సమస్య ఇట్టే దూరమవుతుంది.
డాక్టర్ మంజుషా
మంజుషా ఆయుర్వేదిక్ హాస్పిటల్, మాదాపూర్, హైదరాబాద్
ఫోన్ : 8978 222 777
8978 222 888
040- 64507090
enquiries@manjushaayurveda.com
మూలం: ఆంధ్రజ్యోతి, సకల